Showing posts with label ఓయూలో విద్యార్థి ఆత్మహత్య. Show all posts
Showing posts with label ఓయూలో విద్యార్థి ఆత్మహత్య. Show all posts

Tuesday, January 19, 2010

ఓయూలో విద్యార్థి ఆత్మహత్య

ఓయూలో విద్యార్థి ఆత్మహత్య





హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాలేదన్న మనస్తాపంతో ఉస్మానియా యూనివర్శిటీలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్శిటీలో ఎమ్మెస్సీ చదువుతున్న వేణుగోపాల్ రెడ్డి అనే విద్యార్ధి ఈ అఘాయిత్యానికి పాల్చడ్డాడు. క్యాంపస్ లోని ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో ఒంటిపై కిరోసిన్ పోసుకోని నిప్పుంటించుకోని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వేణుగోపాల్ దగ్థమవుతుండటాన్ని వర్శిటీకీ చెందిన ప్రొఫెసర్ ఒకరు గుర్తించడంతో ఈ వార్త దావానంలా వ్యాపించింది. దీంతో వర్శిటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతకుముందు వేణుగోపాల్ సూసైడ్ నోట్ ను కూడా రాసాడు. తెలంగాణ ఏర్పాటులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా, మనస్తాపంతో తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు వేణుగోపాల్ లేఖలో పేర్కొన్నాడు. సోనియా ఇప్పటికైనా స్పందించి తెలంగాణ ప్రకటించాలని నోట్ లో వేణుగోపాల్ కోరాడు. అయితే ఉస్మానియా యాజమాన్యం మంగళవారం నుండి విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించేందుకు సమాయాత్తమవుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Cartoons